సుఖసంతోషాలు: జగన్, పవన్ వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
గణపతి శోడశ రూపలు పూజలు: ఒక్కో రూపం విశిష్టత తెలుసుకోండి
వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతి తెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల వెల్లడించారు.
On this happy occasion of #VinayakaChavithi, May Lord Ganesha bless your home with much love, joy and prosperity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2018
పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
'తెలుగువారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణానికి ప్రీతికరంగా ఈ పండుగను దేశ ప్రజలు జరుపుకోవాలని నా ఆకాంక్ష. మట్టి వినాయక విగ్రహాలతో పూజలు జరపండి. పర్యావరణాన్ని పరిరక్షించండి' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.