ఆ ఛానెళ్లపై నిషేధం ఎత్తేయాలి: విరసం నేతలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలివేతకు సోమవారానికి వంద రోజులు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని సుందరయ్య కళా నిలయంలో విరసం నేతలు మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై సదస్సు నిర్వహించారు.
రెండు ఛానళ్లను నిలిపివేసి సోమవారం నాటికి వంద రోజులు అయిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందంచలేదని, టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, ఏబీఎన్ నిలిపివేతకు ఇప్పటివరకు ఒక్క కారణం కూడా చెప్పలేదని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.
రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కేంద్రం చెప్పినా ఎంఎస్ఓలు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. తమ చేతిలో ఏమీ లేదని టీ ప్రభుత్వం చెబుతోందని... జర్నలిస్టుల నిరసనలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
విరసం నేతలు
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలివేతకు సోమవారానికి వంద రోజులు పూర్తి అయ్యాయి.
విరసం నేతలు
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని సుందరయ్య కళా నిలయంలో మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. మీడియా ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
విరసం నేతలు
రెండు ఛానళ్లను నిలిపివేసి సోమవారం నాటికి వంద రోజులు అయిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందంచలేదని, టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, ఏబీఎన్ నిలిపివేతకు ఇప్పటివరకు ఒక్క కారణం కూడా చెప్పలేదని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.
విరసం నేతలు
రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కేంద్రం చెప్పినా ఎంఎస్ఓలు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు.