వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వారు మారరు!: విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన విష్ణు కుమార్ రాజు
అమరావతి: ఐఏఎస్ అధికారులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
విధి నిర్వహణలో భాగంగా అధికారులు తమ విధులను నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వాలు మారుతాయని, అధికారులు మాత్రం మారరు అన్నారు. వారి పని వారు చేస్తుంటారన్నారు. అధికారులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని సూచించారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఖండించింది. తాము అధికారంలోకి వస్తే సతీశ్ చంద్ర సంగతి చూస్తామని హెచ్చరించడం బాధ్యతా రాహిత్యమని సంఘం రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
vishnu kumar raju vijaya sai reddy ias ysr congress telugudesam ys jagan chandrababu naidu విష్ణు కుమార్ రాజు విజయ సాయి రెడ్డి ఐఏఎస్ వైయస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు
English summary
BJP leader Vishnu Kumar Raju condemned YSR Congress Party MP Vijaya Sai Reddy comments on IAS officers.
Story first published: Thursday, February 22, 2018, 21:19 [IST]