జగన్ పార్టీలోకి వివి వినాయక్ సోదరుడు, టిలోను పోటీ
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప కుటుంబం మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ముత్యాలపాప, ఆమె భర్త వెంకటరమణ మూర్తి తదితరులు సోమవారం శ్రీకాకుళం వెళ్లి తమ వియ్యంకుడు కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద రావుతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్ను కలిసి ఆ పార్టీ కండువా వేయించుకోవడానికి సిద్ధపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, కర్రి సీతారామ్ కూడా కాంగ్రెస్ను వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.
ఎల్లారెడ్డి నుండి జగన్ పార్టీ పోటీ?
తెలంగాణ ప్రాంతంలో ఉనికి కోల్పోతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి మాత్రం ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకుల్లో నుండి ఒక్కర్ని ఎట్టి పరిస్థితుల్లో పోటికి దింపాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందట.
ఆ పార్టీ సెగ్మెంట్ ఇన్చార్జిగా పెద్దపట్లోళ్ల సిద్దార్థ రెడ్డి ఆ పార్టీకి సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చారు. అనుకోని సంఘటనల వల్ల కొన్ని నెలల పాటు సిద్దార్థరెడ్డి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సిద్దార్థ రెడ్డికి బాధ్యతలు అప్పగించి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుండి ఆయన్ను పోటీకి దింపాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.