గోదావరి: రూ. 50 లక్షలు బ్లాక్ మనీ సీజ్
స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు మొత్తం రూ. 1,000 నోట్లు అని కస్టమ్స్ అధికారులు అన్నారు. శనివారం చెన్నై నుంచి బొకారో ఎక్స్ ప్రెస్ లో ఓ వ్యక్తి వచ్చాడు.
అమరావతి: గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మనీ తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని దగ్గర ఉన్న రూ. 50 లక్షల విలువైన పెద్ద నోట్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు మొత్తం రూ. 1,000 నోట్లు అని కస్టమ్స్ అధికారులు అన్నారు. శనివారం చెన్నై నుంచి బొకారో ఎక్స్ ప్రెస్ లో ఓ వ్యక్తి వచ్చాడు. అతను గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా సంచరించడంతో అధికారులకు అనుమానం వచ్చింది.
వెంటనే అతనిని అదుపులోకి తీసుని విచారించారు. అతని దగ్గర ఉన్న బ్యాగ్ పరిశీలించగా రూ. 50 లక్షల పెద్దనోట్లు (రూ.1,000 నోట్లు) బయటపడ్డాయి. ఈ డబ్బు ఎక్కడిది ? ఎక్కడికి తీసుకు వెలుతున్నావు ? అని ప్రశ్నిస్తే అతను పొంతన లేని సమాధానం ఇస్తున్నాడని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.