అనాథలుగా వదిలేసిన మాకు వాడెందుకు :మావోయిస్టు కిరణ్ తల్లిదండ్రులు
తాళ్ళపూడి :తమ ను అనాథలుగా వదిలిన కొడుకు గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మావోయిస్టు కిరణ్ తల్లిదండ్రులు.పదేళ్ళుగా తాము చచ్చామో బతికామో కూడ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాళ్ళపూడి మండలం ములకపల్లి గ్రామానికి చెందిన గడ్డం సువర్ణరాు అలియాస్ కిరణ్ ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించారు.ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం కల్గించింది.బ్రహ్మనందం, అన్నమ్మ దంపతుల చిన్న కొడుకు కిరణ్ పదేళ్ళు క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.మావోయిస్టు పార్టీలో చేరిన నాటి నుండి ఆయన ఒక్కసారి కూడ గ్రామానికి రాలేదు. తల్లిదండ్రులతో మాట్లాడలేదు.
ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో కిరణ్ మరణించాడు.ఈ విసయాన్ని స్ధానిక మీడియా ప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.కిరణ్ మరణించిన విషయం అప్పటివరకు వారికి తెలియలేదు. బ్రహ్మనందానికి ఇద్దరు కొడుకులున్నారు. 2009 లో బ్రహ్మనందం పెద్ద కొడుకు హాత్యకు గురయ్యాడు. అప్పటికే మావోయిస్టు పార్టీలో చేరిన కిరణ్ ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించాడు. వృద్దాప్యంలో ఉన్న తమ ఆలనా పాలనా చూసే వారే లేరని ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
బ్రహ్మనందానికి ఇటీవలే కడుపులో కణుతులు రాగా, ఆపరేషన్ చేసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బందిపడుతున్నారు. కిరణ్ మరణించిన విషయం తమకు తెలియదంటున్నారు. తమను అనాథలుగా వదిలిన కొడుకు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కిరణ్ తల్లిదండ్రులు.