వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం : రామసుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ఒక పార్టీ కార్యకర్త ఉసురు తీసిన విషయం తెలిసిందే .కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు కార్యకర్త గురునాథ రెడ్డి మృతికి కారణం కాగా పోలీసులు కొండాపురం మండలం పింజి అనంతపురంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ప్రస్తుతం గ్రామంలో పికెటింగ్ కొనసాగుతుంది.

కడప జిల్లాలో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ..కార్యకర్త దారుణహత్య.. గ్రామంలో పోలీసుల పికెట్కడప జిల్లాలో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ..కార్యకర్త దారుణహత్య.. గ్రామంలో పోలీసుల పికెట్

గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం విషయంలో జరిగిన ఘర్షణలో వైసీపీ వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి రాడ్లు , రాళ్ళతో కొట్టుకున్నారు .గండి కోట ప్రాజెక్టు ముంపు పరిహారం జాబితాలో అనర్హులు ఉన్నారంటూ గురునాథ్ రెడ్డి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టడం కోసం మండల స్థాయి గ్రామ సభ నిర్వహించారు . ఈ క్రమంలో వైసిపి కి చెందిన మరొక వర్గం గురునాథ్ రెడ్డితో గొడవకు దిగగా రాడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడిన క్రమంలో గురునాథ్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు.

We will bring the murder of Gurunath Reddy to the attention of CM Jagan: Ramasubbareddy

Recommended Video

Biodiversity Flyover Accident CCTV Footage Exclusive Visuals || Oneindia Telugu

దీంతో తీవ్ర గాయాలపాలైన రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు . రామసుబ్బారెడ్డి అనుచరుడైన గురునాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రామసుబ్బారెడ్డి గురునాథ రెడ్డి హత్య విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో, రామసుబ్బారెడ్డి వర్గీయుడు అయిన గురునాథ్ రెడ్డి హత్యగావించ బడ్డాడు. దీంతో జమ్మలమడుగు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి . వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఓ కార్యకర్త దారుణ హత్యకు కారణమైంది.

English summary
The murder of Gurunath Reddy, a follower of Ramasubbareddy , has caused tension in Jammalamadugu. Visiting the family of Gurunath Reddy, a follower of Ramasubbareddy, Ramasubbareddy said that CM Jaganmohan Reddy would bring the matter of Gurunath Reddy's murder to his attention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X