శాడిస్ట్ భర్త రాజేష్ అరెస్ట్: 'కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక'
చిత్తూరు: శాడిస్ట్ భర్త రాజేష్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రాజేష్తో పాటు అతని తండ్రి కుమారస్వామి రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
చేతకానివాళ్లకు పెళ్లెందుకు: 'శాడిస్ట్ మొగుడు'పై నన్నపనేని, విచారణలో రాజేష్ ఆసక్తికర విషయాలు
శాడిస్టు భర్త: తొలి రాత్రే నవవధువుకు నరకం చూపాడు, పరిస్థితి విషమం
వారికి జడ్జి రిమాండ్ విధించారు. జడ్జి ఆదేశాల మేరకు గంగాధర నెల్లూరు పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. అంతకుముందే, రాజేష్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
అంతకుముందు నన్నపనేని పరామర్శ
అంతకుముందు, భర్త చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించిన విషయం తెలిసిందే.
కఠిన చర్యలు తీసుకునేలా నివేదిక
శైలజ ఆరోగ్య పరిస్థితి గురించి నన్నపనేని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. అనంతరం రాజకుమారి మాట్లాడారు. శైలజపై కిరాతకంగా దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేశారని
బాధితురాలు శైలజకు అండగా ఉంటామని నన్నపనేని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
రాజేష్ విషయం వెలుగులోకి
కాగా, మోతరంగనపల్లెకు చెందిన కుమారస్వామి రెడ్డి కొడుకు రాజేష్కు శైలజతో మూడు రోజుల క్రితం పెళ్లైన విషయం తెలిసిందే. అయితే పెళ్లైన తొలి రోజు శోభనం రాత్రినే ఆమెను చిత్రహింసలకు గురి చేసిన విషయం తెలిసందే. ఆమె రోదిస్తూ గది బయటకు వచ్చింది. దీంతో రాజేష్ విషయం వెలుగు చూసింది.