బ్రాహ్మిణి సరే భారతి మాట, సాక్షితో కాలుష్యమే: రేవంత్

బ్రాహ్మిణి ధరించిన ఆభరణాల విలువ కోట్లలో ఉంటుందని సాక్షి దిన పత్రిక ఇచ్చింది. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతి ఏడాది స్వచ్ఛందంగా తన ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారని, దీనిని జగన్ పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. జైలులో ఉన్న జగన్ను భారతి పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఆమె చెవులకు ఉన్న వజ్రాభరణాలు ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తావో చెప్పాలన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలకు, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పోలికే లేదన్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణలు అగ్రశ్రేణి నటులను, కష్టపడి సంపద ఆర్జించుకున్న కుటుంబాలు అన్నారు. బాబు తండ్రి, తాత కూడా కష్టపడి పైకొచ్చిన వారే అన్నారు. వైయస్ కుటుంబం చరిత్ర చూస్తే ఒకరు రొడీ, మరొకరుదొంగ, ఇంకొకరు రౌడీషీటర్ అని మండిపడ్డారు.
బలపనూరులో బతకలేక మతం మార్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాను కొన్నప్పటి ఆస్తుల విలువలను, చేసిన పెట్టుబడులను చెప్పారన్నారు. వాటిని ప్రస్తుత విలువతో లెక్కించడం సబబు కాదన్నారు. జగన్ కుటుంబ సభ్యులకు చిత్తశుద్ధి ఉంటే వారి ఆస్తుల వివరాలు, వారికున్న కంపెనీలు, పెట్టుబడుల గురించి చెప్పాలన్నారు. సాక్షి రాసేవన్నీ చెత్తరాతలనీ, ఆ టీవి ఛానెల్ వల్ల శబ్ద కాలుష్యం తప్పిస్తే ఇంకేమీ ఉండదని ఎద్దేవా చేశారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications