కే టాక్స్ సృష్టికర్తలు ఎక్కడ..? కోడెల కుమారుడు, కుమార్తె అదృశ్యం..!!
గుంటూరు/హైదరాబాద్ : కే-టాక్స్ పేరిట నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలపై పోలీసు కేసులు నమోదైన వేళ, వారు పట్టణం నుంచి అదృశ్యమయ్యారు. వీరిపై ఇప్పటివరకూ మొత్తం ఐదు కేసులు నమోదుకాగా, వాటిల్లో రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. భూకబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోడెల ఆయన కుమారుడు కోడెల శివరామ్, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు సమాచారం.
అసెంబ్లీ
సాక్షిగా
జగన్
తొలి
ఫిరాయింపు
టార్గెట్..!
ప్రతిపక్షాన్ని
చీల్చుకెళ్లిన
షరతుల
బుల్లెట్..!!
బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వారిపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావించిన పోలీసులు, నోటీసులు ఇచ్చి విచారించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, విషయం తెలిసి శివరామ్, విజయలక్ష్మిలు నరసరావుపేటను వీడినట్టు సమాచారం.
వీరిద్దరూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండగా, వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరలో వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీలోని సీనియర్ నేతలకు గుబులు మొదలైంది. ఈ వరుసలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తండ్రి పదవిని అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనయుడు శివరామకృష్ణ సాగించిన దారుణాలు ఒక్కొకటీ వెలుగు చూస్తున్నాయి.
పలు కంపెనీల నుంచి నయానా.. భయానా సుమారు 70 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీనంతటికీ కోడెల కారణమంటూ బలమైన ఆధారాలు కూడా బాధితుల నుంచి పోలీసులు స్వీకరించారట. సత్తెనపల్లిలో ఐదేళ్లపాటు కే ట్యాక్స్ పేరిట వసూళ్లకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుందంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.