వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్కే ఎక్కడ?
హైదరాబాద్: మావోయిస్టుల అగ్రనేత ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఆర్కే భార్య శిరీష అలియాస్ పద్మక్క హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఓ వ్యక్తి సామాన్యుడైనా, మావోయిస్టు అయినా ప్రాణాలు విలువైనవని, ఆర్కే విషయంలో గందరగోళం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్కే చనిపోయాడా..? పోలీసుల అదుపులో ఉన్నాడా అని ఏపీ ప్రభుత్వ లాయర్ ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
Comments
English summary
Where Is Maoist Leader Ramakrishna, Court Asks Andhra Pradesh Police.
Story first published: Tuesday, November 1, 2016, 17:31 [IST]