వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రిషికేశ్వరి కేసులో బాబుకేం సంబంధం, అనూషపై రోజా రాజీ కుదిర్చింది!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన పైన వైసిపి బురద జల్లే ప్రయత్నం చేస్తోందని టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు బుధవారం మండిపడ్డారు.

చంద్రబాబు పైన వైసిపి, ఎమ్మెల్యే రోజా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంబంధం లేని విషయాలను ముఖ్యమంత్రికి అంటగడుతున్న వైసిపి నేతలు రోజురోజుకు దిగజారుతున్నారన్నారు.

ప్రకాశం జిల్లాలో బూచేపల్లి సుబ్బారెడ్డి కళాశాలలో హెచ్ఓడీ వేధింపులతో అనూష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే రోజా ఎక్కడా కనిపించడం లేదని నిలదీశారు. అనూష కుటుంబం, కాలేజీ యాజమాన్యం మధ్య రోజా రాజీ కుదిర్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

'Where is Roja in Anusha incident?'

తిరుపతి బ్రహ్మోత్సవం వేళ..: చంద్రబాబు ఆనందం

తిరుపతి బ్రహ్మోత్సవం వేళ పట్టిసీమ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్ నుంచి నీటిని విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చశారు. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమన్నారు.

గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై ఏకసభ్య కమిషన్

గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట ఘటన పైన ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. విచారణ అధికారిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులును నియమించింది. ఆరు నెలల్లో నివేదిక అందజేయాలని చెప్పింది. గోదావరి పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
'Where is YSR Congress party MLA Roja in Anusha suicide incident?'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X