మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉంది?: నోటీసులపై అమిత్ షాకు బాబు ప్రశ్న
అమరావతి: నాడు ఎస్సారెస్పీ పరిధిలోని బాబ్లీ ప్రాజెక్టును కట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. దీనిపై నాటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దీంతో తాను ఉద్యమించానని అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అరెస్టు వారెంట్ జారీ చేశారని వాపోయారు.
బాబ్లీ విషయంలోనే కాదని, అలమట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలోను తాను పోరాటం చేశానని చంద్రబాబు చెప్పారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అలమట్టి ఎత్తు పెంపును ఆపలేకపోయాయని వాపోయారు. తాను తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం పోరాడానని చెప్పారు.
అరెస్ట్ వారెంట్లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా?
అరెస్ట్ వారెంట్ల విషయంలో తనకు సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పారని, కానీ మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉందని, ఎవరి ప్రభుత్వం ఉందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమకు నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పారు. ప్రభుత్వాలు బ్యాంకులు దోచుకుంటున్న వారిని విదేశాలకు పంపిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.