విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షపై వణుకెందుకు? సాయిరెడ్డి
అమరావతి: అయిదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను పునఃసమీక్షిస్తాంటూ ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలానికి దారి తీసింది. పీపీఏల పునఃసమీక్ష నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయని, పరిశ్రమలు రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా అందినప్పుడే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయని అంటున్నారు. పారిశ్రామికవేత్తలను భయాందోళనకు గురి చేయడానికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఆరోపిస్తున్నారు. ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించడమంటే మాటలు కాదని, దీనివల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని విమర్శించారు.
Recommended Video
ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. అయిదేళ్ల కాలంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తామంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని నిలదీశారు. పవన్, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురైందని విమర్శించారు.
మౌన ముని! నిజాలన్నీ కక్కేస్తున్న తెలుగు తమ్ముళ్లు: నోరు మెదపని చంద్రబాబు!
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్దలకు వందల కోట్ల రూపాయల మేర కమీషన్లు ముట్టాయని ఆరోపించారు. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట్ర ఖజానాపై సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని, ప్రజాధనం వృధా అయిందని అన్నారు. యూనిట్ ఒక్కింటికి 2 రూపాయల 70 పైసలకు బహిరంగ మార్కెట్లో లభిస్తోంటే 4 రూపాయల 84 పైసలను ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ప్రశ్నించారు సాయిరెడ్డి. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారని మండిపడ్డారు.
సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పున:పరిశీలన చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారు చంద్రబాబు గారూ. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల ప్రజాధనం వృధా అయింది. యూనిట్ 2.70కి వస్తుంటే 4.84 చెల్లించారు. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 16, 2019