ప్రత్యేక హోదా అందుకే రావడం లేదు: బాబుపై శ్రీకాంత్ రెడ్డి, బడ్జెట్పై విమర్శలు
అమరావతి: నాలుగేళ్లుగా కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పైన ఏ ఒక్క వర్గానికి ఆసక్తి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురువారం విమర్శించారు. అంకెల గారడీ తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు.
ఏపీ బడ్జెట్: రాజధాని అమరావతికి భారీగా నిధులు, స్టార్టప్, ఐటీ శాఖ... ఏఏ శాఖకు ఎంత అంటే
ప్రతిసారి ఏపీ ప్రభుత్వం డబుల్ గ్రోత్ చూపిస్తోందని, అందుకే కేంద్రం నుంచి సహకారం అందడం లేదని చెప్పారు. వ్యవసాయం 40 శాతం ఎలా అభివృద్ధి అయిందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో కేవలం రూ.12వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారన్నారు.
త్వరలో ఎన్నికలు ఉన్నందున, స్టంట్ కోసం అన్నాక్యాంటీన్లకు రూ.200 కోట్లు కేటాయించారన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు కాకపోవడానికి టీడీపీయే కారణమని చెప్పారు. రూ.4వేలు ఖర్చు పెట్టినా ఒక్క ఇటుక అయినా రాజధాని నిర్మాణానికి పడిందా అని ప్రశ్నించారు.