వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంలో చేతులు పెడితే కాలుతాయి, బిజెపి మోసం, ఏపీపై పగ: చంద్రబాబు సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఏపీకి న్యాయం చేస్తారని బిజెపితో పొత్తు పెట్టుకొంటే మిత్రపక్షం తమను మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేతులు పెడితే కాలిపోతాయని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సంక్షోభంగా అభివర్ణించారు. తన రాజకీయ జీవితంలో మూడో సంక్షోభాన్ని చూస్తున్నానని బాబు చెప్పారు.

ప్రత్యేకహోదా: బానిస బతుకులే, హీరోయిన్ల వెంటే, సినిమాలను అడ్డుకొంటాం: రాజేంద్రప్రసాద్ సంచలనం ప్రత్యేకహోదా: బానిస బతుకులే, హీరోయిన్ల వెంటే, సినిమాలను అడ్డుకొంటాం: రాజేంద్రప్రసాద్ సంచలనం

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా బిజెపిపై మరోసారి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరడం తప్పా అంటూ బాబు ప్రశ్నించారు.

శేఖర్‌రె్డ్డితో సంబంధాలపై పవన్ యూ టర్న్, ఆ వ్యాఖ్యలు బాధించాయి: లోకేష్ సంచలనం శేఖర్‌రె్డ్డితో సంబంధాలపై పవన్ యూ టర్న్, ఆ వ్యాఖ్యలు బాధించాయి: లోకేష్ సంచలనం

మూడో సంక్షోభాన్ని చూస్తున్నా

మూడో సంక్షోభాన్ని చూస్తున్నా

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనను పదవి నుండి తప్పించిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన చరిత్ర రాష్ట్ర ప్రజలకు ఉందని బాబు గుర్తు చేశారు. ఆగష్టు సంక్షోభం తర్వాత రాష్ట్ర విభజన అనే సంక్షోభాన్ని కూడ తాను చూశానని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మూడో సంక్షోభంగా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

పోలవరంలో చేతులు పెడితే కాలిపోతాయి

పోలవరంలో చేతులు పెడితే కాలిపోతాయి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కూడ అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. నీతి ఆయోగ్ సిపారసు మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని బాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో లాలూచీ పడినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు అప్పగించారని చెప్పారు. అయితే కేంద్రం సూచన మేరకే నవయుగ కంపెనీ పనులను అప్పగించినట్టు ఆయన చెప్పారు. పోలవరం విషయంలో కొందరు చేతులు పెట్టాలని చూస్తున్నారని, అలా చేతులు పెడితే కాలిపోతాయని బాబు విరుచుకుపడ్డారు.

ఏపీ అంటే ఎందుకంత పగ

ఏపీ అంటే ఎందుకంత పగ

ఏపీ రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే బిజెపితో పొత్తును పెట్టుకొన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే మిత్రపక్షంగా ఉన్న బిజెపి కూడ తమను మోసం చేసిందని ఆయన చెప్పారు. ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర విభజన సమయంలో బిజెపి కోరలేదా అంటూ బాబు ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తోంటే యుద్దం ప్రకటిస్తారా అంటూ బిజెపి నేతలను బాబు ప్రశ్నించారు.

ఎన్నో అవమానాలు పడ్డాను

ఎన్నో అవమానాలు పడ్డాను


ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో 29 సార్లు ఢిల్లీకి వెళ్ళినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కానీ, రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం సహకరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కోసం అనేక ఇబ్బందులు పడ్డానని చెప్పారు. అనేక అవమానాలను కూడ పంటిబిగువన ఓర్చుకొన్నానని బాబు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హేతు బద్దత పాటిస్తే ఈ కష్టాలు వచ్చేవి కావని బాబు చెప్పారు.

English summary
Ap chief minister Chandrababunaidu made allegations on Bjp leaders on Tuesday. He addressed in Ap assembly on Tuesday at Amaravathi.why bjp not support for Ap state he asked in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X