వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడెవడో తిట్టాడని.. పనికిరానిది? నేనైతే ఇలా: విజయసాయి అంశంపై బాబుకు ఉండవల్లి

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి తనను తిట్టాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు పదేపదే ప్రస్తావించడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.

ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వాడెవడో అమ్మానాన్నలను తిట్టాడని, వీడెవడో తిట్టాడనే విషయం వదిలేయాలని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు రాజకీయాలను పక్కన పెట్టాలని, బాధ్యతల నుంచి తప్పుకోవాద్దన్నారు.

Why Chandrababu Naidu taking serious Vijaya Sai Reddy comments: Undavalli

రాజకీయ ప్రయోజనాలను వద్దని హితవు పలికారు. హోదా విషయంలో ఆఖరుగా రియలైజ్ అయింది చంద్రబాబే అన్నారు. ఆయన తిట్టాడని, ఈయన తిట్టాడని పనికి రాని వాటిని తీసిపారేయాలని హితవు పలికారు. ఎవరైనా తిడితే ఏమయిందని, తిట్టుకోవడం కొత్త కాదన్నారు. ఎప్పుడు అదే ఇష్యూనా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి అవిశ్వాసంపై చర్చ జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు.

పవన్‌ది సిల్లీ క్యారెక్టర్, విజయసాయి గబ్బు: ఆదినారాయణ, 'మోడీ-జైట్లీ వద్ద సుజన లాబీయింగ్'పవన్‌ది సిల్లీ క్యారెక్టర్, విజయసాయి గబ్బు: ఆదినారాయణ, 'మోడీ-జైట్లీ వద్ద సుజన లాబీయింగ్'

తాను పబ్లిక్‌లో మాట్లాడినప్పుడు ఎవరైనా తిట్టినా అంగీకరిస్తానని ఉండవల్లి చెప్పారు. తాను విమర్శలు చేసినప్పుడు వారికి కూడా మాట్లాడే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. నేను మాట్లాడితే వారికీ మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. తనను తిట్టిన వారు తనను అభిమానించినట్లుగా భావిస్తానని చెప్పారు. చంద్రబాబు అనవసరమైన వాటిని సీరియస్‌గా తీసుకోకుండా ఏపీ ప్రయోజనాలపై సీరియస్‌గా దృష్టి సారించాలని హితవు పలికారు.

English summary
Former MP Undavalli Arun Kumar on Thursday questioned why AP CM Nara Chandrababu Naidu taking serious YSRCP MP Vijaya Sai Reddy comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X