అందుకోసమే చంద్రబాబును మనుమడు ముద్దుపెట్టుకోలేదా ?
తణుకు :ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అమరావతి నుండే పాలన సాగిస్తున్న నేపథ్యంలోనే వీలు చూసుకొని హైదరాబాద్ కు వస్తున్నాడు. వచ్చినప్పుడు మనమడు దైవాన్ష్ తో గడుపుతున్నాడు. అయితే మనమడితో ఎక్కువ కాలం గడపలేకపోతున్నాడు. ఇటీవల తన కుటుంబానికి దూరంగా ఉంటూ తాను కూడ ఇబ్బందిపడుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడు స్వయంగా ఎపిలోని సచివాలయ ఉద్యోగులకు చెప్పారు.
చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ కొడుకు దైవాన్ష్ . హైదరాబాద్ కు బాబు వస్తే ఎక్కువ సమయం దైవాన్ష్ తో గడిపేందుకు ఇష్టపడుతుంటారు.అయితే లోకేష్ ఆయన సతీమణి బ్రహ్మణి దినపత్రికల్లో వచ్చే చంద్రబాబునాయుడు ఫోటోలను దైవాన్ష్ కు చూపుతూ తాతకు ముద్దుపెట్టాలని సూచిస్తారు. తల్లిదండ్రుల సూచన మేరకు దైవాన్ష్ దినపత్రికలోని చంద్రబాబు పోటోకు ముద్దుపెడుతుంటారు.
టిడిపి నాయకుడి వివాహా వేడుకల్లో పాల్గొనేందుకు ఎపి సిఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు వచ్చాడు. ఈ సందర్బంగా మనమడితో ఆయన కొద్దిసేపు గడిపారు. అయితే తాతకు ముద్దుపెట్టాలని దైవాన్ష్ ను లోకేష్ కోరారు. అయితే ఎప్పటిలాగే దైవాన్ష్ మాత్రం దినపత్రికలోని చంద్రబాబునాయుడు ఫోటోను తీసుకొని ముద్దుపెట్టాడు. ఈ ఘటన చూసి చంద్రబాబు షాక్ గురయ్యాడు.
ఎందుకిలా జరిగిందనే దానిపై ఆరాతీస్తే ప్రతి రోజూ దినపత్రికల్లో వచ్చే ఫోటో చూపి ముద్దుపెట్టాలని కోరితే దైవాన్ష్ అలానే చేస్తారని, రోజు మాదిరిగానే చంద్రబాబు ఎదురుగా ఉన్న కూడ దినపత్రికలోని ఫోటోకే దైవాన్ష్ ముద్దుపెట్టారని లోకేష్ చంద్రబాబుకు చెప్పారు.రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను తాను కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయాన్ని చంద్రబాబునాయుడు కుటుంబసభ్యలు వద్ద ప్రస్తావించారు. ఈ అంశాలను టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేష్ పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఈ అంశాన్ని వెల్లడించారు.