వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌పై జగన్ డబుల్ గేమ్: కాల్వ, దారినపోయే దానయ్య: మంత్రి నారాయణ

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదని టీడీపీ నేత, మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదివారం మండిపడ్డారు.

టీడీపీ నేతలపై ఊగిపోయిన సోము వీర్రాజుటీడీపీ నేతలపై ఊగిపోయిన సోము వీర్రాజు

బడ్జెట్ విషయంలో జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ ఏపీకి అన్యాయం జరుగుతున్నప్పటికీ తన బాధ్యతను విస్మరించిందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

Why YS Jagan not responding on Budget, questions Kalva

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని అందరు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు చెబుతున్నప్పటికీ జగన్ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రశ్నించలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

జగన్ పైన మంత్రి నారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. జగన్‌కు ప్రజలు ప్తిపక్ష హోదా ఇచ్చింది అబద్దాలు చెప్పేందుకు కాదన్నారు. పేదల అభ్యున్నతికి చేపట్టిన పథకాలపై ప్రతిపక్షం అసత్యాలు మానుకోవాలన్నారు. దారిన పోయే దానయ్య ఇచ్చే సమాచారంతో జగన్ మాట్లాడటం సరికాదన్నారు.

English summary
Telugudesam Party leader and Minister Kalva Srinivasulu on monday questioned YSR Congress Party chief YS Jagan Mohan Reddy over Union Budget 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X