ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు, ఫేస్ బుక్ ప్రేమ విడదీసింది,చివరికిలా..

ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు. వివాహమై కొన్నిరోజులే అవుతోంది.అయితే భర్త తనను వేధిస్తున్నాడని ఓ బార్య పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు:ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు. అయితే వారిద్దరి మద్య ఏమైందో కాని భార్య,భర్తల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ఆళ్ళనానికి కాలనీకి చెందిన టి.భువన చంద్రికకు ఫేస్ బుక్ ద్వారా ఉప్పుటూరి సాయికిరణ్ పరిచయమయ్యాడు.

వీరిద్దరి మద్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఏమైందో ఏమో కాని , వీరిద్దరూ కొన్ని కారణాలతో విడిపోయారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు.

wife harassed by husband in eluru

అయితే భువన చంద్రికకు ఆళ్ళనాని కాలనీకి చెందిన ఎలక్ట్రీషీయన్ బండి భాస్కర్ రావు పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది.

కొంత కాలం తర్వాత వీరిద్దరూ కూడ పెళ్ళిచేసుకోవాలని భావించారు. అనుకొన్నట్టుగానే వివాహం చేసుకొన్నారు. అయితే భార్య, భర్తల మధ్య ఏమైందో ఏమో కాని, భర్త తనను ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు ఏలూరు టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. భాస్కర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.

English summary
wife harassed by husband in eluru.bhasker rao married bhuvana chadrika recently. buhvana chandrika complaint against bhasker rao on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X