వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికలు: టీడీపీలో పోటీ పడుతున్న ఆ ‘ముగ్గురు’, తేల్చేసిన వైసీపీ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో వాటిపై ఆశలు పెట్టున్న నేతల్లో తీవ్ర ఉత్కంఠ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కగా, వైఎస్సర్సీపీకి ఒక స్థానం దక్కనుంది.

వైఎస్సార్సీపీ ఇప్పటికే తన రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు టీడీపీ తన రెండు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు టీడీపీలో ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.

మూడు స్థానాలకు మార్చి 23న ఎన్నిక...

మూడు స్థానాలకు మార్చి 23న ఎన్నిక...

రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి మార్చి 23వ తేదీన ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి టీడీపీ తరఫున దేవేందర్‌గౌడ్‌ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులో తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్‌కి ఏపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్‌కు తెలంగాణ ప్రాతినిథ్యం లభించింది.

టీడీపీకి రెండు, వైఎస్సార్సీపీకి ఒకటి...

టీడీపీకి రెండు, వైఎస్సార్సీపీకి ఒకటి...

రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి, వైఎస్సర్సీపీకి ఒక స్థానం దక్కనుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. టీడీపీ తనకు వచ్చే రెండు స్థానాలను ఎవరికి కేటాయించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు.

టీడీపీలో పోటీపడుతున్న ముగ్గురు...

టీడీపీలో పోటీపడుతున్న ముగ్గురు...

టీడీపీలో రెండు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు పోటీ పడుతున్నారు. టీడీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న యనమల తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలంగా చంద్రబాబును కోరుతున్నారు. అయితే అసెంబ్లీ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండే యనమలను రాజ్యసభకు పంపితే తనకు ఇబ్బంది అవుతుందేమో అనేది చంద్రబాబు ఆలోచన.

సీఎం రమేష్‌కు నో చాన్స్? రేసులో కంభంపాటి, ఆదాల...

సీఎం రమేష్‌కు నో చాన్స్? రేసులో కంభంపాటి, ఆదాల...

ఇక తాను పార్టీకి ఎప్పట్నించో సేవ చేస్తున్నాను కాబట్టి ఈసారి రాజ్యసభకు తనను ఎంపిక చేయాలని కంభంపాటి కోరుతుండగా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనను రాజ్యసభకు పంపాల్సిందేనని ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అడుగుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ తరఫున తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్‌ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ చంద్రబాబు అందుకు సుముఖంగా లేరని అంటున్నారు.

ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి చాన్స్?

ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి చాన్స్?

ఈసారి ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వర్ల రామయ్య, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని పార్టీ అధినేత ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పార్టీయేతరులకూ అవకాశం?

పార్టీయేతరులకూ అవకాశం?

అంతేకాదు, భవిష్యత్తు అవసరాలు, కార్పొరేట్‌ లాబీయింగ్‌ కోసం పార్టీయేతర వ్యక్తులకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ కూడా చంద్రబాబు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వేరే పార్టీకి చెందిన వ్యక్తి అయినా, రాజ్యపభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా తన గళం వినిపించగలరనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
With the schedule for the Rajya Sabha elections out, the guessing game has begun in the ruling Telugu Desam Party. Names are being thrown up and possibilities are being revved up. One name doing rounds is that of AP’s portly finance minister Yanamala Ramakrishnudu. Yanamala is eager to enter the upper house. Also floating around is the name of JP of Lok Satta. Chandrababu feels that though he isn’t directly a part of the TDP, he would effectively voice the concerns of Andhra Pradesh in the upper house.Though Chandrababu is ostensibly doing a lot of exercise on the names and is eliciting the opinions of the party leaders, these two names are said to be almost fixed. The TDP can easily get the duo elected. But, the real interest is on the third seat. Going by the numbers, the third seat must go to the YSRCP and it is said to have finalised Nellore entrepreneur Vemireddy Prabhakar Reddy as its candidate. But, will the YSRCP win the seat or will there be desertions from the party denying Reddy a victory? Well! The guessing game has begun. Even if two MLAs crossover, the TDP could win the seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X