గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'దయచేసి.. నా కాపురాన్ని నిలబెట్టండి.. అత్తనే ఇదంతా చేస్తోంది'

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తనపై కక్ష గట్టిన అత్త భర్తను తన నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తోందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె టీడీపీకి చెందిన నాయకురాలని, ఆమెను తన జోలికి రాకుండా చూడాలని ఆమె కోరుతోంది. ఇదే విషయాన్ని విన్నవించుకుందామని గురువారం చంటిబిడ్డను ఎత్తుకుని ఆమె సీఎం నివాసం వద్దకు వచ్చింది.

అయితే ఆమె గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి ఇంటిముఖం పట్టింది. ఆమె పేరు పిల్లి మేరీగా సమాచారం. దకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన పిల్లి కోటయ్యతో మూడేళ్ల క్రితం ఆమె వివాహం జరిగింది. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహం కోటయ్య కుటుంబ సభ్యులకు నచ్చలేదు.

woman alleges mother in law trying to separate her husband

ఈ నేపథ్యంలో గుంటూరులోని చుట్టుగుంటలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఓ పాప కూడా పుట్టింది. కోటయ్య తల్లి పిల్లి లీల ప్రస్తుతం వార్డు మెంబరుగా ఉన్నారు. వీరిద్దరి వ్యవహారంపై ఆమె పెదకాకాని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల మేరీ, కోటయ్యలను పిలిచి విచారించారు. దీంతో తామిద్దరం ఇష్టపడే ప్రేమ వివాహం చేసుకున్నామని వారు పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు కేసు మూసివేశారు.

అయినా అత్త పిల్లీ లీల మాత్రం తమను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రయత్నాలను నిలువరించి తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె వాపోతున్నారు.

English summary
A woman came to CM Chandrababu Naidu's residence in Vijayawada on Thursday, she alleged that her mother-in-law trying to seperate her husband
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X