గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త మృతి: కూతురితో సహా మహిళ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Woman commits suicide at Srikalahasthi
చిత్తూరు/ గుంటూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. రాజీవ్ నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో మరణించాడు.

అప్పటి నుంచి అతని భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతూ వస్తోంది. భర్త లేకుండా తాను జీవించలేనంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ స్థితిలో శనివారం ఉదయం లక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురు ప్రసన్నతో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

వారిద్దరు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుమారుడు ఇంట్లో లేడని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

లేడీ టీచర్ ఆత్మహత్యాయత్నం

తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక శనివారం ఉదయం పాఠశాల ఆవరణలోనే ఓ గిరిజన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి ఆందోళనకరుంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

బొల్లాపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో జ్యోతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెపై తోటి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై ఆమె ప్రధాన ఉపాధ్యాయుడికి కూడా ఫిర్యాదు చేసింది.

ప్రధాన ఉపాధ్యాయుడు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ఆమెపై వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman has commited suicide along with her daughter at Kalahasthi in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X