సోనియా బర్త్డే: మహిళా నేతల రక్తదానంపై కాంట్రోవర్సీ
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు చేసిన రక్తదానం వివాదానికి కేంద్ర బింధువు అయింది. డిసెంబర్ 9 సోనియా జన్మదినం సందర్భంగా సోమవారం పలువురు మహిళా నాయకులు గాంధీ భవన్లో రక్తదానం చేశారు.
అయితే వారు అందరూ రక్తదానం చేయలేదని, కేవలం పడుకొని మాత్రమే ఫోటోలకు ఫోజులిచ్చారని, ఆ తర్వాత రక్తదానం చేయకుండానే లేచారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సోనియా జన్మదినం సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చేందుకు మాత్రమే పడుకొని నవ్వారని, రక్త దానం పేరుతో హైడ్రామా నడిపారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా పడుకొని అలా లేచి వెళ్లిపోయారంటున్నారు. కొందరు ఫోటోలకు ఫోజులివ్వగా, మరికొందరు మాత్రమే రక్తదానం చేశారంటున్నారు.
కాగా, రక్తదానం కార్యక్రమం అనంతరం రాష్ట్ర మహిళా కాంగ్రెసు నేత ఆకుల లలిత మాట్లాడుతూ.. పదిహేను మంది రక్తదానం చేశారని చెప్పారు. రక్తదానం చేసి బర్కత్పురా రెడ్ క్రాస్ సొసైటీ అందించారు.