వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ పవర్ కోసం ఏపీలో మరో యాగం.. చేస్తోంది బాబు కోసం.. చేసేది వంగవీటి రాధా !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : వైసిపి నేత‌ల‌కు పోటీగా.. వ‌ంగ‌వీటి రాధా శ్రీయాగం...!! | Oneindia Telugu

వైసిపిని వీడి టిడిపిలో చేరిన వంగ‌వీటి రాధాకృష్ణ రాజ‌కీయంగానే కాదు..ఆధ్యాత్మికంగానూ ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ను లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న రాధా ఇప్పుడు తాజాగా ముఖ్య‌మంత్రి మ‌రో సారి అధికారంలోకి రావాల‌రి ఆకాక్షింస్తూ శ్రీయగం నిర్వ‌హిస్తున్నారు.

 చంద్ర‌బాబు కోసం..

చంద్ర‌బాబు కోసం..

రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆ కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం చేపట్టారు. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో రుత్విక్కుల ఆధ్వర్యంలో యాగం ప్రారంభించారు. మూడురోజులపాటు వేద మంత్రోచ్ఛారణల నడుమ సాగే యాగం.. ఏప్రిల్‌ 3న ఉదయం పూర్ణాహుతితో ముగుస్తుంది. రాష్ట్రంలో కుల, మతాల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా శాంతి యుతంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని రాధా పేర్కొన్నారు. మాజీ ఎమ్మె ల్యే వంగవీటి రత్నకుమారి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చెల్లెలు బావ‌లతో యాగం..

చెల్లెలు బావ‌లతో యాగం..

వంగవీటి రాధాకృష్ణ మళ్లీ చంద్రబాబే సీఎం కావాలంటూ శ్రీయాగం కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. మూడు రోజుల పాటు కొనసాగే శ్రీయాగాన్ని రాధా తన చెల్లెలు, బావలతో చేయిస్తున్నారు. రాధా సోదరి ఆషా, ఆమె భర్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట గోపూజ, అనంతరం వాస్తు హోమం నిర్వహించి ఆపై శ్రీయాగం మొదలు పెట్టారు. రుత్విక్కుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగం ఏప్రిల్ 3న పూర్ణాహుతి నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్నారు. ఈ యాగం చేయడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, శత్రుపీడ, సంకల్పసిద్ధి జరుగుతుందని వంగవీటి రాధా తెలిపారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని తపిస్తున్న చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ఈ యాగం చేస్తున్నట్టు స్ప‌ష్టం చేసారు.

ఏం తమ్ముళ్లూ! మీకు రోషం లేదా? పౌరుషం లేదా? కేసీఆర్ తొత్తులకు ఓటేస్తారా? : చంద్రబాబుఏం తమ్ముళ్లూ! మీకు రోషం లేదా? పౌరుషం లేదా? కేసీఆర్ తొత్తులకు ఓటేస్తారా? : చంద్రబాబు

పార్టీ సూచ‌న‌ల మేర‌కు ప్ర‌చారం..

పార్టీ సూచ‌న‌ల మేర‌కు ప్ర‌చారం..

వంగ‌వీటి రాధా నాలుగు రోజుల క్రితం పెడ‌న లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైసిపి అధినేత జ‌గ‌న్ పై కీల‌క వ్యాఖ్య లు చేసారు. జ‌గ‌న్ ను లోట‌స్ పాండ్ కు త‌రిమేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా కృష్ణా జిల్లాతో పాటు గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కాపు ఓట‌ర్ల ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో రాధాకు ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక‌, ఇప్పుడు గాయాల నిర్వ‌హ‌ణ ద్వారా వంగ‌వీటి రాధా తిరిగి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు రావాలంటూ ఎంత బ‌లంగా కోరుకుంఉన్నారో చెప్ప‌క‌నే చెబుతున్నారు. జ‌గ‌న్ గెలుపు కోసం వైసిపి నేత‌లు యాగాలు చేస్తుండ‌గా..చంద్ర‌బాబు గెలుపు కోసం టిడిపి నేత‌లు సైతం యాగాల బాట ప‌ట్టారు.

English summary
TDP leader Vangaveeti Radha performing Sri Yagam for Chandra Babu to come again in Power. Radha recently resigned YCP and joined in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X