ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్య : యనమల రామకృష్ణుడు
ఏపిలో ప్రజావేదిక భవనాలను కూల్చడం తుగ్లక్ చర్యగా అభివర్ణించారు టీడీపీ నేత మాజీమంత్రి యనమల రామక్రిష్ణుడు..కొత్తవి నిర్మించకుండా ఉన్న భవనాలు కూల్చడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ప్రజావేదిక అనేది అన్నివర్గాలకు సంబంధించిన అంశంమని పేర్కోన్నారు. జగన్ అభివృద్ధిని మరిచి విధ్వంసంపై దృష్టి పెట్టడం కరెక్టు కాదని దుయ్యబట్టారు.మాజీ సీఎం చంద్రబాబు లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందని, ప్రజావేదికను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
సచివాలయంలోని భవనాలను కూడా కూల్చివేస్తారా అని యనమల ప్రశ్నించారు. 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూల్చివేస్తారా అని యనమల నిలదీశారు.ఆంధ్రప్రదేశలో ప్రజావేదిక భవనాలు కూల్చడం సంచలనం రేపుతున్న అంశం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ప్రజావేదిక భవనం అక్రమ కట్టడం అంటూ ప్రభుత్వం కూల్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది.
క్రిష్ణా నది ఒడ్డున అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేస్తామని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. దీంతో ప్రజా వేదిక కూల్చి వేయడంపై అటు టీడీపీ ఇటు వైసీప వర్గాల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది..ఇక ప్రజావేదిక తోపాటు నది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడాలను సైతం కూల్చి వేస్తామని ప్రభుత్వం సిద్దం అవుతంది.