రాజ్యసభకు వెళ్తా: యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే వెళ్తానని యనమల అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే వెళ్తానని యనమల అన్నారు.
ఏపీ కేబినెట్లో కీలక మంత్రిగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమే. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నేనెప్పుడూ అడగలేదు..
తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని.. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మంత్రి యనమల స్పష్టం చేశారు. అది కావాలి...ఇది కావాలి అని తానెప్పుడూ అడగలేదని ఆయన చెప్పారు.
యనమల ఎందికిలా?
‘35ఏళ్లు రాష్ట్రంలో పనిచేశాను. ఇది నా సుదీర్ఘ అనుభవం' అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.
అధిష్టాన నిర్ణయమే..
అంతేగాక, తన అవసరం ఎక్కడ ఉంటుందనేది అధిష్టానం చూసుకుంటుందని మంత్రి యనమల చెప్పడం గమనార్హం. మంగళవారం మీడియాతో మంత్రి యనమల చిట్చాట్ నిర్వహించారు.
చర్చకు దారితీసిన యనమల వ్యాఖ్యలు
అయితే, టీడీపీలో ముఖ్య నేతగా మంత్రి వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడు హఠాత్తుగా రాజ్యసభకు వెళ్తానని అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయనకు రాజ్యసభకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.