చంద్రబాబునాయుడు.. డేరా బాబాకు తేడా లేదు... వైసీపీ ఎమ్మెల్యే
చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.ఇక చంద్రబాబు లోకేష్తో కలిసి చేసిన దీక్ష కేవలం వెయిట్ లాస్ కోసమేనని ఎద్దెవా చేశారు. ఇక చంద్రబాబు కు డేడా బాబాకు తేడా లేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్నవి దోంగ దీక్షలని ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసమే లోకేష్తో కలిసి దీక్ష చేశారని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇసుక దీక్షపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి ఫైర్ అయ్యారు. ఆయన చేస్తున్నవి దోంగదీక్షలని , వాటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఇసుకలో వేల కోట్లు సంపాదించిన చంద్రబాబు ఇప్పుడు దీక్ష చేయడం హస్యంగా ఉందని అన్నారు.
ఏపీలో కురిసిన వర్షాల వల్ల వరదలు వచ్చాయని దీంతో కొంత మేర ఇసుక కొరత ఉందని ప్రభుత్వమే ఒప్పుకుంటుందని చెప్పినా ప్రతిపక్షాలు ఇసుక కొరతపై రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు. ఇసుక కొరత ఉన్నా... లక్షా యాబై వేల టన్నులు సరఫరా అవుతోందని ఆయన చెప్పారు. రాబోయో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తామని చెప్పారు.ఇక కార్మికులకు భరోస ఇచ్చేందుకు వారోత్సవాలు నిర్వహిస్తుందని అన్నారు. ఇక ఇసుక వెబ్సైట్ను హ్యక్ చేసిన బ్లూ ఫ్రాగ్ సంస్థ యజమాని , మరియు చంద్రబాబునాయుడులు చాల సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే చాపర్లో తిరిగే వారని ఆయన ఆరోపించారు.