మాలోకానిది మామూలు బ్రెయిన్ కాదు :దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్ : సాయిరెడ్డి సెటైర్లు..!!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..మాజీ మంత్రి లోకేశ్ పైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో చంద్రబాబు, నారా లోకేష్లపై సెటైరిక్గా విమర్శలు చేశారు. కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్ అంటూ పోస్ట్ చేసారు. ఇక, లోకేశ్ విషయంలో సైతం సాయి రెడ్డి ట్వీట్లు చేసారు. పప్పు.. మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా అంటూనే మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది అంటూ ట్వీట్ చేసారు. మాజీలైన మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్మన్లలాగా కాపలా కాయడం ఏమిటి అని ప్రశ్నించారు.
ఆ కితకితలు ఎందుకో అర్దమైందిగా...
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగ అంటూ... చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట అని శుక్రవారం లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ట్వీట్ చేసారు.
70 గేట్లు తెరిచినా
నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్ కనిపించింది అని వివరిస్తూనే.. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది అంటూ ట్వీట్ చేసారు. భ్రమరావతి అనే ప్రపంచ నంబర్ వన్ రాజధానిలో ఉన్న నాలుగు భవనాలకు స్వాతంత్ర దినోత్సవం రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతగా మురిసి పోవడం ఏమిటి బాబుగారూ.. కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్. మీరు దోచుకున్న సొమ్ము నుంచి అన్నక్యాంటీన్ల బకాయిలు వంద కోట్లు చెల్లిస్తే ఇప్పుడే క్యాంటీన్లు తెరుచుకుంటాయి. రెండు లక్షలు ఖర్చయ్యే షెడ్డుకు 30-40 లక్షలు దండుకున్నారు. ఆ డబ్బును తిరిగిచ్చినా క్యాంటీన్లు ఐదేళ్ల పాటు నడుస్తాయి. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేసారు.
లోకేశ్ పెద్దమనిషయ్యాక..
మాజీలైన మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్మెన్లలాగా కాపలా కాయడం ఏమిటి? కర్మ కాకపోతే. ముంపు ప్రాంతాలను డ్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారని మీడియాను దబాయిస్తున్నారు. లింగమనేని ఇంటి గురించి ఆందోళన మానేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయపడండి బాబూ. లోకేశ్ పెద్ద మనిషయ్యాక ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది...అంటూ అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..ఇటు మాజీ మంత్రి లోకేశ్ పైన విజయ సాయిరెడ్డి వరుస ట్వీట్లతో ఫైర్ అయ్యారు.