'కిడ్నాప్ చేశాం, చంపేస్తే రూ.10 లక్షలు, బతకాలంటే రూ.15 లక్షలివ్వండి'
విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఓ యువకుడిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు. ఇది తెలియగానే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఓ యువకుడిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు. ఇది తెలియగానే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్కు గురైన యువకుడి పేరు మణికంఠ. కిడ్నాపర్లు మణికంఠ సోదరికి ఫోన్ చేశారు. అతనిని చంపేస్తే తమకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు, మీరు రూ.15 లక్షలు ఇస్తే వదిలి పెడతామని చెప్పారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాపర్ల కోసం రెండు బృందాలి గాలిస్తున్నాయి. ఫోన్ కాల్ ఆధారంగా తర్యాఫ్తు చేపట్టారు. మణికంఠ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే కిడ్నాప్ జరిగిందా, మరేదైనా ఉందా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, మణికంఠ తల్లిదండ్రులు ప్రయవేట్ ఉద్యోగాలు చేస్తూ తమ జీనవం సాగిస్తున్నారని, ఆర్థికంగా అంత స్థితిమంతులు కాదని తెలుస్తోంది. ధనవంతుడు కాని మణికంఠను కిడ్నాప్ చేయాల్సిన అవసరమేమొచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.