అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేపలమ్ముకుంటున్నా, నా సంగతేంటి!: బాబును కంగుతినిపించిన యువకుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ప్రశ్న ఎదురయింది! ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. తాను డిఎస్సీ పాసైన చేపలు అమ్ముకుంటున్నానని, తమకు పోస్టింగ్ ఎప్పుడిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు.

పోస్టింగ్ ఇవ్వకపోవడంతో తాను చేపలు అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్నానని చెప్పాడు. దీంతో కంగుతున్న చంద్రబాబు ఆ యువకుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్టణంలో ఆదివారం నాడు చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. తనిఖీలలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నున్న చేపలా మార్కెట్‌కు వెళ్లారు. చేపలమ్ముకుంటున్న ఓ యువకుడితో మాట్లాడారు.

Youth, who sells fishes questions Chandrababu

మీ సమస్యలు ఏమిటని చంద్రబాబు ఆ యువకుడిని ప్రశ్నించారు. ఆ యువకుడి పేరు త్రినాథ్. ముఖ్యమంత్రి అడగటంతో తన సమస్యను అతను చెప్పుకున్నాడు.

2014లో డీఎస్సీ క్వాలిఫై అయి 45 వ ర్యాంకు సాధించానని, ఇంత వరకూ పోస్టింగ్ ఇవ్వలేదని, జీవనోపాధి కోసం చేపలు అమ్ముకుంటున్నానని చెప్పాడు. తనకు ఉద్యోగం ఎప్పుడిస్తారని అతను చంద్రబాబుని ప్రశ్నించాడు. వారం రోజుల్లో డీఎస్సీ పోస్టింగ్ లిచ్చే ఏర్పాటు చేస్తున్నామని బాబు హామీ ఇచ్చారు.

English summary
Youth, who sells fishes questions AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X