వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ఆస్తుల కేసులో మరో షాక్: ఇందూ 132 కోట్ల ఆస్తులు జఫ్తు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జఫ్తు చేసింది. ఇందూకు చెందిన రూ.132 కోట్ల ఆస్తులను జఫ్తు చేశారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత నెల ఫిబ్రవరిలో మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. అప్పుడు మొత్తం రూ.232కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. జననీ ఇన్ఫ్రా, ఇండియా సిమెంట్ స్థలాలు, ఆస్తులను అటాచ్ చేశారు.
జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ పైన అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు పలుమార్లు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు ఇందూ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జఫ్తు చేసింది.
Comments
ys jagan ysr congress vijaya sai reddy cbi probe వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్ విజయ సాయి రెడ్డి సీబీఐ దర్యాఫ్తు
English summary
ED attaches Rs.132 crores of Indu in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case.
Story first published: Thursday, March 26, 2015, 12:06 [IST]