వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైం వచ్చినప్పుడు మేమూ కొడతాం, అందుకే గెలిచారు: నంద్యాలపై జగన్

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి ఓటమిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం స్పందించారు. ఆయన హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల/హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి ఓటమిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం స్పందించారు. ఆయన హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు.

గెలుపు దిశగా టిడిపి: మౌనిక ఆనందం, ఇంట్లోంచి బయటకు రాని జగన్గెలుపు దిశగా టిడిపి: మౌనిక ఆనందం, ఇంట్లోంచి బయటకు రాని జగన్

భయపెట్టి చంద్రబాబు గెలిచారు

భయపెట్టి చంద్రబాబు గెలిచారు

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని జగన్ అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. సాధారణ ఎన్నికలు కాదు కాబట్టి చంద్రబాబు గెలిచారన్నారు.

శిల్పా సోదరులకు హ్యాట్సాప్

శిల్పా సోదరులకు హ్యాట్సాప్

శిల్పా సోదరులకు హ్యాట్సాప్ అని జగన్ అన్నారు. వారు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు. శిల్పా చక్రపాణి రెడ్డి తన ఆరేళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేశారని ప్రశంసించారు.

టైం వచ్చినప్పుడు మేమూ కొడతాం

టైం వచ్చినప్పుడు మేమూ కొడతాం

మాకు టైం వచ్చినప్పుడు మేమూ కొడతామని వైయస్ జగన్ అన్నారు. నంద్యాల గెలుపు చంద్రబాబు విజయం కాదన్నారు. ప్రజలు భయపడి టిడిపికి ఓట్లు వేశారని చెప్పారు. ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు.

వారికి థ్యాంక్స్

వారికి థ్యాంక్స్

ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురికాకుండా కష్టపడ్డ కార్యకర్తలందరికీ థ్యాంక్స్ అనిజగన్ అన్నారు. వైసిపి నైతిక విలువలకు కట్టుబడి ఉందని చెప్పారు. చంద్రబాబుది గెలుపు కాదని, దిగజారుడు రాజకీయమన్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారన్నారు.

రూ.200 కోట్లు ఖర్చు చేశారు, బాబుకు సవాల్

రూ.200 కోట్లు ఖర్చు చేశారు, బాబుకు సవాల్

నంద్యాల ఉప ఎన్నికల కోసం చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారని జగన్ ఆరోపణలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికలు రెఫరెండం కాదని, ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలని బాబుకు సవాల్ విసిరారు. దానిని రిఫరెండంగా భావిస్తామన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోవడం బాబుకు అలవాటే అన్నారు. ఉప ఎన్నికలపై జగన్ పలుమార్లు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

English summary
People have again shown confidence and trust in development and good governance, says Aandhra Pradesh CM Chandrababu Naidu after the result. YSRCP chief YS Jagan challenged CM Chandrababu on defected MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X