వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఒకేవైపు పరుగెడుతున్న చంద్రబాబు-జగన్, మూల్యం తప్పదు'

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఇరువురు కూడా ఒకేవైపు పరుగెడుతున్నారని, వారు బిజెపి వైపు పరుగెత్తుతున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఇరువురు కూడా ఒకేవైపు పరుగెడుతున్నారని, వారు బిజెపి వైపు పరుగెత్తుతున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు: రోజాకు మళ్లీ షాక్, నోటీసులుమరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు: రోజాకు మళ్లీ షాక్, నోటీసులు

చంద్రబాబు, జగన్.. ఇద్దరు కూడా బిజెపి వైపు ఎందుకు పరుగెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇందుకు వారిద్దరు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు.

YS Jagan and Chandrababu run towards BJP: Congress

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం అప్రజాస్వామికం అని చింతా మోహన్ మండిపడ్డారు.

చంద్రబాబుకు తెలియదా?

కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు పులిచింతల ప్రాజెక్టు తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మరో కాంగ్రెస్ నేత శివాజీ వేరుగా అన్నారు. కృష్ణా డెల్టాకు 80 టిఎంసీలకు పైగా నికర జలాలు ఉన్న సంగతి చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

పట్టిసీమ నిర్వహణ ఖర్చు కొండంత అని, ఫలితం మాత్రం గోరంత అన్నారు. టిడిపి అద్భుతం అంటున్న పట్టిసీమ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పోలవరం కాలువ తవ్వించకుంటే సాధ్యం అయ్యేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.40 వేల కోట్లు కేంద్రం నుంచి రాబట్టాలన్నారు.

English summary
Congress Party leader Chinta Mohan on Tuesday said that AP CM Nara Chandrababu Naidu and YSR Congress Party chief YS Jaganmohan Reddy are running towards BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X