బాబు పార్టీ ఉండదు: జగన్, విజయమ్మ రోడ్షో(పిక్చర్స్)
కృష్ణా/విజయనగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, చల్లపల్లిలో పర్యటించగా, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విజయనగరంలోని గరివిడి, చిపురుపల్లి నియోగజకవర్గంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో పేదలను పట్టించుకోలేదని ఆరోపించిన జగన్, ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇస్తానని హామీలిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత అంటే తెలియదని, ఎన్నికలయ్యాక చంద్రబాబు, టిడిపి ఉండదని, ఈ విషయం ఆయనకు కూడా తెలుసని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో పేదలు వైద్యం చేసుకోవాలంటే భయపడిపోయేవారని, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో అతి తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం లభించిందని అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.
విజయం మాదే: విజయమ్మ
ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, గరివిడి ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ పార్టీ విజయం నిశ్చయమని, ప్రజల కష్టాలు తీరే రోజులు మరెంతో దూరంలో లేవని ఆమె అన్నారు.
జగన్ అభివాదం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో పేదలను పట్టించుకోలేదని ఆరోపించిన జగన్, ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇస్తానని హామీలిస్తున్నారని దుయ్యబట్టారు.
విజయమ్మ ప్రసంగం
ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు.
విజయమ్మ ప్రసంగం
ఎన్నికల్లో తమ పార్టీ విజయం నిశ్చయమని, ప్రజల కష్టాలు తీరే రోజులు మరెంతో దూరంలో లేవని విజయమ్మ అన్నారు.
భారీగా హాజరైన జనం
బుధవారం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, గరివిడి ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించారు.