స్పీకర్పై అవిశ్వాసం: ఏం చేద్దాం.. ఎమ్మెల్యేల మద్దతు లేక జగన్ డైలమా
సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అవిశ్వాస తీర్మానం పెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు. అయితే అవిశ్వాసంపై వైసిపి డైలమాలో ఉందని
అమరావతి: సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అవిశ్వాస తీర్మానం పెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు. అయితే అవిశ్వాసంపై వైసిపి డైలమాలో ఉందని తెలుస్తోంది.
అవిశ్వాసమా.. పోయేదేం లేదు: జగన్కు బాబు కౌంటర్, సాక్షి పత్రికపై..
స్పీకర్పై తీర్మానం ఇస్తే యాభై మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. అయితే 50 మంది సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతో తర్జనభర్జన పడుతోంది. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గకపోతే పరిస్థితేంటి, ఎలా ముందుకెళ్లాలని జగన్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారని.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని వైసిపి ప్రకటించింది. దానికి సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అవిశ్వాస తీర్మానం పెడితే పోయేదేం లేదన్నారు. గతంలో జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టారు.. కానీ నెగ్గలేదు.