అక్రమాస్తుల్లో నా పేరు తొలగించండి: జగన్, మోసం చేశాడు, పక్కా ఆధారాలు: సిబిఐ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.
చదవండి: 'జగన్ జగతి కోసం బెదిరించారు, కుట్రలో సాయిరెడ్డి కీలకం, తిరిగివ్వమన్నా'
అక్రమాస్తుల కేసులో నా పేరు తొలగించండి
రాంకీ, వాన్పిక్, జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జీషీట్ నుంచి తనను తొలగించాలని వైయస్ జగన్ ఆ పిటిషన్లో కోరారు. అయితే జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
జగన్ మోసంపై పక్కా ఆధారాలు
పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని సిబిఐ కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. జగన్ పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిబిఐ తెలిపింది.
విజయసాయి రెడ్డి కూడా ఇటీవలే పిటిషన్
జగన్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్పై శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో తన పేరును తొలగించాలని పేర్కొంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఇటీవల డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ పైనా సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
విజయసాయి రెడ్డిపై కౌంటర్ ఇలా
2007లో డైరెక్టర్ పదవికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేసినా పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారని సాయి రెడ్డిపై కౌంటర్ పిటిషన్లో సిబిఐ ఇటీవల పేర్కొంది. ఆయనపై అభియోగాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని తెలిపింది.