బాబు డైరెక్షన్లోనే నారాయణ హత్య, ఓటమి భయంతోనే కేఈ: జగన్ ఫైర్
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించబోమనే భయంతోనే తెలుగుదేశం నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస పార్టీ అధినేత నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం
పులివెందుల: వచ్చే ఎన్నికల్లో విజయం సాధించబోమనే భయంతోనే తెలుగుదేశం నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస పార్టీ అధినేత నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాత్రధారుడని జగన్ ఆరోపించారు.
తమ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిలో ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు.. రేపు తామే గెలవొచ్చు అని అన్నారు. చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే పత్తికొండలో హత్యలు జరిగాయని జగన్ ఆరోపించారు. నారాయణ రెడ్డి హత్య పథకం ప్రకారమే చేశారని అన్నారు.
ఇసుకు మాఫియాపై నారాయణ రెడ్డి యుద్ధం చేశారని అన్నారు. కేఈ కుమారుడిపై విచారణకు హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో నారాయణ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తే మూడు నెలల్లో ప్రభుత్వం తొలగించిందని అన్నారు. నారాయణ రెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ నిందితుడని, కేసును సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు.
కేఈ కృష్ణమూర్తి పాత్రధారి అయితే, సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే నారాయణ రెడ్డి హత్య జరిగిందని జగన్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కేఈ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేఈకి చంద్రబాబు ఆశీస్సులున్నాయని అన్నారు.
సీబీఐతో విచారణ చేయిస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఒకర్ని చంపితే అభ్యర్థి లేకుండా పోతారా? నాయకుడు లేకుండా పోతారా? అని జగన్ ప్రశ్నించారు. నారాయణ రెడ్డి స్థానంలో ఆయన భార్య పోటీ చేసి 50వేల ఓట్ల మెజార్టీతో పత్తికొండలో గెలిచే పరిస్థితి వస్తుందని జగన్ అన్నారు.
ఇది ఇలా వుంటే.. అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, స్పీకర్ పదవులకు పోటీ ఉండకూడదని జగన్ అన్నారు. అత్యున్నత పదవులు ఏకగ్రీవమైతే వాటి హుందాతనం పెరుగుతుందన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా కోడెల శివప్రసాదరావుకు అందుకే మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు.