కెసుల భయంతోనే అలా: జగన్పై ఎపి మంత్రులు
హైదరాబాద్: కేసుల భయంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా ముందుకు రావటం లేదని మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గవర్నరు ప్రసంగంలోని అన్ని అంశాలు అమలు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మనుగడ ఉండదని జగన్ భయపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు.
ఎస్ఈజెడ్ల పేరుతో డబ్బులు దండుకోవటానికి నాడు వైఎస్ జీవోలు విడుదల చేశారని మంత్రులు ఆరోపించారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు భూములిచ్చారని, కానీ జగన్ రాద్ధాంతం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాజధాని నిర్మాణం మొదటిదశ 2018 నాటికి పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు.
సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను రాయలసీమకు తరలించడమే పట్టిసీమ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులను ప్రస్తుత ధరలకే జగన్ కోరుకున్న వారికి కాంట్రాక్టులు ఇస్తామని వాటిని నిరీ్నత సమయంలో పూర్తి చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు పోలవరంతో సంబంధం లేదన్నారు.