నిన్న పవన్ కళ్యాణ్పై ఇలాగే: జగన్పై బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్య
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి కామినేని శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి కామినేని శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం పైన జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఇప్పటికే పలువురు పార్ట్ టైం పొలిటీషియన్ అని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సమస్యల పైన స్పందిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాలకు కేటాయించలేదు. దీంతో ఆయనను పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారు. ఇప్పుడు జగన్ పైన కూడా అదే కామెంట్ చేయడం విడ్డూరం.
గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యం: జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు (గురువారం) పర్యటిస్తున్నారు. ఆయన మారేడుమిల్లి నుంచి వీఆర్ పురం బయలుదేరారు. వీఆర్ పురం మండలం అన్నవరంలో కాళ్ల వాపు వ్యాధి మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.
అంతకుముందు, జగన్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మారేడుమిల్లిలో గురువారం ఉదయం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వైద్యులు, రోగులతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్లు పని చేయడం లేదని జగన్ ఆరోపించారు. వేరే వాహనాల్లో దూర ప్రాంతాల ఆస్పత్రులకు తరలించేలోపే గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.