వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ అసాధారణ అడుగు - జస్టిస్ ఎన్వీ రమణపై పోరు ఉధృతం - రాష్ట్రపతి, ప్రధాని వద్దకు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారును అస్థిరపరిచేలా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్నదని, ప్రతిపక్ష నేత చద్రబాబుకు అనుకూలంగా, ఏపీ హైకోర్టు జడ్జిలు తీర్పలు, ఆదేాశాలు ఇస్తున్నారని, ఈ వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అసాధారణ అడుగుకు సిద్ధమయ్యారు. జస్టిస్ రమణపై పోరును ఉధృతం చేస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ వర్గాలు పలు సంకేతాలు ఇస్తుండగా, దీనిపై సీఎం జగన్ మరోసారి కీలక పర్యటన జరపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.

రేవంత్ రెడ్డి మంత్రాంగం: బీజేపీకి షాక్ - తీసేసిన తహశీల్దార్‌లా హరీశ్ రావు - దుబ్బాకలో కాంగ్రెస్ ఎంపీరేవంత్ రెడ్డి మంత్రాంగం: బీజేపీకి షాక్ - తీసేసిన తహశీల్దార్‌లా హరీశ్ రావు - దుబ్బాకలో కాంగ్రెస్ ఎంపీ

లేఖ రాసి వారం కావొస్తున్నా..

లేఖ రాసి వారం కావొస్తున్నా..

దేశచరిత్రలోనే తొలిసారి ఓ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి, అది కూడా త్వరలో చీఫ్ జస్టిస్ కావాల్సిన వ్యక్తిపై ఒక ముఖ్యమంత్రి ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఈ వ్యవహారంపై సీజేఐకు ఫిర్యాదు లేఖ రాయడమే కాకుండా దాన్ని మీడియాకు బహిర్గతం చేయడం సంచలనం రేపింది. న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కావడంతో జగన్ లేఖపై సీజేఐ జస్టిస్ బోబ్డే ఆచితూచి వ్యవహరిస్తున్నారని, కాబట్టే వారం రోజులు కావొస్తున్నా సదరు ఫిర్యాదుపై సీజేఐగానీ, ఆయన కార్యాలయంగానీ ఎలాంటి తొందరపాటు ప్రకటన చేయలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా, ఈ వ్యవహారంలో జగన్ తదుపరి అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే దేశాధినేతల వద్దకు వెళ్లాలని ఏపీ సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబుసీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబు

రాష్ట్రపతి, ప్రధానితో భేటీకి..

రాష్ట్రపతి, ప్రధానితో భేటీకి..

ఏపీ సీఎం, సుప్రీం జడ్జిల మధ్య సాగుతోన్న వ్వహారాన్ని జాతీయ మీడియా ‘యుద్ధం'గా అభివర్ణించడం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణపై పోరును ఉధృతం చేయడంలో భాగంగా ఏపీ సీఎం జగన్.. రాజ్యాంగ అధినేత, రాష్ట్రపతి అయిన రామ్ నాథ్ కోవింద్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్ర మోదీతో సైతం మరోసారి సమావేశం కావాలనుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరోసారి ఢిల్లీకి జగన్..

మరోసారి ఢిల్లీకి జగన్..

రాష్ట్ర అధినేత హోదాలో సీఎం జగన్ పలు మార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినప్పటికీ, గతవారం జరిపిన పర్యటన అత్యంత కీలకంగా ఉండింది. ఈనెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన రోజే సీఎం జగన్.. సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డేను కలిసి, జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను అందించినట్లు సీఎం సలహాదారు అజయ్ కల్లాం ఇటీవలే మీడియాకు తెలిపారు. కాగా, తదుపరి వ్యూహంలో భాగంగా మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు జగన్ రెడీ అయ్యారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్మెంట్ ఖరారైన మరుక్షణమే ఆయన ఢిల్లీకి పయనం కానున్నారని తెలుస్తోంది.

ఆ జడ్జిలపై విచారణకు వైసీపీ పట్టు..

ఆ జడ్జిలపై విచారణకు వైసీపీ పట్టు..

ఎన్డీఏ నుంచి పలు పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతోన్న తరుణంలో.. దేశంలోనే అత్యధిక ఎంపీలు కలిగిన మూడో పార్టీగా వైసీపీ.. కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లులకు మద్దతు తెలపడం, మోదీ సర్కారు నిర్ణయాలకు బాసటగా నిలబడటం రాజకీయ సమీకరణాల్లో మార్పునకు సంకేతంగా గోచరిస్తాయి. అయితే, హైకోర్టు జడ్జిలు, సుప్రీం జడ్జిపై ఫిర్యాదు రాజకీయ అంశం కానప్పటికీ, జగన్ తన లేఖలో హైకోర్టు జడ్జిలు, సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఎవరో ఒకరు రాష్ట్రపతి జోక్యాన్ని కోరే అవకాశం ఉండటంతో జగన్ ముందుగానే కోవింద్ ను కలిసేందుకు ప్రయత్నాలు ఆరంభించడం కీలకంగా మారింది. జస్టిస్ రమణ, ఇతర జడ్జిలపై విచారణ జరగాల్సిందేనని వైసీపీ కోరుతున్న వేళ ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠగా మారింది.

English summary
Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy likely to take extreme step in the battle with alleged pro chandrababu judiciary lobby. amdi his letter to cji justice sa bobde on supreme court judge justice nv ramana, the chief minister seeks appointment with president ramnath kovind and prime minister narendra modi. ap cmo and ysrcp sources says that jagan likely to go to Delhi in next couple of days after confirmation of appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X