వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయికుమార్‌కు జగన్ పరామర్శ: అమరజీవికి నివాళి(ఫొటో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌ను సోమవారం పరామర్శించారు. సాయికుమార్ తండ్రి, సినీ నటుడు పిజె శర్మ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే.

 YS Jagan pays tributes to Potti Sriramulu

పిజె శర్మ మృతికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సోమవారం ఆయన సాయికుమార్‌కు ఫోన్ చేసి ఓదార్చారు. పిజె శర్మ మణికొండలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో పిజె శర్మ అంత్యక్రియలు నిర్వహించారు.

పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళి

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత విజయసాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Monday payed tributes to Amarajeevi Potti Sriramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X