వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ అవినీతిని మిథున్ అడ్డుకున్నారు, అందుకే కేసు: జగన్ షాకింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఆయన జైలులో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిలను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లో కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వైసిపి నేతలను అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

YS Jagan reveals behind Mithun Reddy's arrest!

కేసుల పేరుతో తమ పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుంటూ నీచమైన రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. నారా లోకేష్ చేస్తున్న అవినీతిని అడ్డుకున్న కారణంతోనే మిథున్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.

విమానాశ్రయంలో మిథున్ రెడ్డి తప్పు ఉంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ మేరకే వైసిపి నేతల పైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ఆగడాలను ప్రజా క్షేత్రంలో అడ్డుకుంటామన్నారు. చంద్రబాబుకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

English summary
YSRCP chief YS Jagan reveals behind Mithun Reddy's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X