హఠాత్తుగా వైయస్ జగన్ పాదయాత్ర వాయిదా, కారణాలివే: 'అసలేం జరిగింది'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
చదవండి: 'విదేశాల నుంచి వచ్చాక జగన్ ఏదో ఒకటి చేయాలిగా, జేసీ చెప్పినట్లు చేస్తాం'
హఠాత్తుగా పాదయాత్ర వాయిదా
అక్టోబర్ 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వైసిపి అంతా సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో హఠాత్తుగా పాదయాత్రను వాయిదా వేస్తున్నారు.
నవంబర్ మొదటి వారానికి
అక్టోబర్ 27వ తేదీన ప్రారంభం కానున్న పాదయాత్ర నవంబర్ మొదటి వారానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇవాలో, రేపో వైసిపి ప్రకటన చేయనుందని తెలుస్తోంది.
కారణాలివే..
జగన్ పాదయాత్ర వాయిదా పడటానికి కారణాలు ఉన్నాయని సమాచారం. కోర్టు కేసులు, పార్టీ కార్యక్రమాలు ఆలస్యం కావటం వంటి అంశాల వల్ల వాయిదా పడిందని తెలుస్తోంది.
వైసిపి కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా
మరోవైపు, విజయవాడలో జరగాల్సిన వైసిపి కార్యాలయం ప్రారంభోత్సవం కూడా వాయిదా పడిందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 27న ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొద్ది రోజులే వాయిదా పడినప్పటికీ..
జగన్ పాదయాత్ర వాయిదా పడింది కొద్ది రోజులు మాత్రమే. అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ మొదటి వారానికి వాయిదా పడనుంది. అయినప్పటికీ ఈ విషయం చర్చకు దారి తీసింది. పార్టీలోను ఆందోళనకు కారణమవుతోందని అంటున్నారు.