వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజా సంకల్పయాత్ర: 2 వేల కి.మీ.చేరువలో జగన్, 40 అడుగుల పైలాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర

అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం నాటికి ( మే 14) రెండు వేల కిలోమీటర్లు చేరుకోనుంది. రెండు వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకోనున్న సందర్భాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించనున్నారు.

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.

జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. మే 14వ తేదిన పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకటాపురం సమీపానికి చేరుకోగానే జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను చేరుకోనుంది.

YS Jagan’s Praja Sankalpa Yatra To Cross 2000 Kms Milestone On May 14

పాదయాత్ర వెంకటాపురం చేరుకోగానే రెండు వేల కిలోమీటర్లకు చేరుకొన్న గుర్తుగా 40 అడుగుల పైలాన్ ను జగన్ ఆవిష్కరిస్తారు. మే 14వ తేదిన ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మే 14, 15 తేదిల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.

English summary
Leader of Opposition in Andhra Pradesh assembly and YSR Congress Party President YS Jagan Mohan Reddy's historic walkathon Praja Sankalpa Yatra is progressing successfully and would reach a new milestone of 2,000 kms on May 14, 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X