టీమిండియాకు జగన్ గుడ్లక్, అప్పుడే వద్దని సైబరాబాద్ కమిషనర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భారత జట్టుకు బెస్టఫ్ లక్ చెప్పారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. విజయపథంలో దూసుకుపోతున్న భారత జట్టు సెమీస్లో ఘన విజయం సాధించాలని ట్వీట్ చేశారు.
మ్యాచ్పై ఆందోళన చెందాల్సిన పనిలేదు: సీవీ ఆనంద్
ఆస్ట్రేలియాతో, భారత్ తలపడుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ పైన ఇప్పుడే ఆందోళన చెందాల్సిన పనిలేదని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్లడం ఖాయమన్నారు. మ్యాచ్పై అప్పుడే అంచనాలకు రావడం సరికాదన్నారు. మరో ఏడు గంటలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందన్నారు. భారత జట్టు స్పిన్నర్లే కీలక పాత్ర పోషించనున్నారన్నారు. చివరి ఓవర్లలో ఇరవై పరుగులు అదనంగా మన బౌలర్లు ఇచ్చారని సీవీ ఆనంద్ అన్నాడు. కోహ్లీ సెంచరీ సాధించాలన్నాడు.
కాగా, ప్రపంచకప్ సెమీఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ర్టేలియా తొలి వికెట్ను కోల్పోయింది. 15 పరుగుల వద్ద వార్నర్(12) ఔటయ్యాడు. అయితే, స్మిత్, ఫించ్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నారు. వారు నిలకడగా ఆడుతున్నారు. మరోవైపు భారత సారథి మహేంద్ర ధోనీ 12వ ఓవర్లోనే విరాట్ కోహ్లీని రంగంలోకి దించాడు. 12వ ఓవర్ వేసిన కోహ్లీ 7 పరుగులు ఇచ్చాడు. ఆసిస్ 19 ఓవర్లకు 99 పరుగులు చేసింది.
Wishing
you
good
luck
in
the
Semis
today
#IND
#IndvsAus
#CWC15!
Let's
go
all
the
way!!
—
YS
Jagan
Mohan
Reddy
(@ysjagan)
March
26,
2015