భూమా నాగిరెడ్డి తప్పులు చెప్పాలా!?, అందుకే టిడిపిలోకి: జగన్ షాకింగ్, నంద్యాలలో పోటీ
తాము సంతాప తీర్మానానికి హాజరైతే భూమా నాగిరెడ్డి మంచితో పాటు తప్పులు కూడా చెప్పవలసి వస్తుందని, అందుకే హాజరు కాలేదని వైసిపి అధినేత వైయస్ జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అమరావతి: తాము సంతాప తీర్మానానికి హాజరైతే భూమా నాగిరెడ్డి మంచితో పాటు తప్పులు కూడా చెప్పవలసి వస్తుందని, అందుకే హాజరు కాలేదని వైసిపి అధినేత వైయస్ జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
భూమా మంచితో పాటు చెడు చెప్పాల్సి వస్తుందనే
సభలో సంతాప తీర్మానానికి వైసిపి హాజరు కాలేదు. దీనిపై జగన్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తాము హాజరైతే భూమా మంచితో పాటు చెడును చెప్పవలసి వస్తుందన్నారు. చనిపోయిన వ్యక్తి గురించి చెడు చెప్పడం ఎందుకని వెళ్లలేదన్నారు.
అఖిలతో మాట్లాడా
సంతాప సమయంలోను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూమా నాగిరెడ్డి మృతి చెందాడని తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. అఖిల ప్రియతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు.
మంత్రి పదవి ఇవ్వక మానసిక క్షోభ
భూమా చనిపోయిన 24 గంటల్లోనే అఖిలను అసెంబ్లీకి తీసుకు రావడం చంద్రబాబుది కుసంస్కారం అన్నారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేశారన్నారు. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తానని బాబు ఆశ పెట్టారన్నారు.
నేను హీరోలా.. నంద్యాల మాదే
నా రాజకీయం హీరోలా ఉంటుందని జగన్ తనను తాను పొగుడుకున్నారు. చంద్రబాబు రాజకీయం విలన్లా ఉంటుందని చెప్పారు. నంద్యాల సీటు మాదేనని, ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీకి పెడతామని తేల్చి చెప్పారు.