చికాకులు... పద్ధతి మార్చుకో లేదంటే: రోజాకు జగన్ గట్టి వార్నింగ్?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా తీరు చికాకు తెప్పిస్తోందా? ఆమెకు హెచ్చరికలు జారీ చేశారా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా తీరు చికాకు తెప్పిస్తోందా? ఆమెకు హెచ్చరికలు జారీ చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
రోజాతో కష్టం!: జగన్కు ప్రశాంత్ కిషోర్ షాకింగ్ రిపోర్ట్? బ్రేకులు వేసేనా
ఆమె తీరు జగన్ ఆగ్రహానికి కారణమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రోజాకు ఇబ్బందులు మొదలయ్యాయనే ప్రచారం సాగుతోంది. రోజా నిత్యం టిడిపి ప్రభుత్వం, చంద్రబాబుపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తుంటారు.
పిలిపించి, మందలించారా
అలాంటి రోజాకు అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం ఇప్పుడు చర్చకు దారి తీసింది. రోజా వ్యవహారశైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో జగన్.. రోజాను పిలిపించి గట్టిగా మందలించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలా ఆమెను మందలించడం మొదటిసారి కాదని, గతంలోను పలుమార్లు చెప్పారని అంటున్నారు.
ఈసారి కొంచెం కటువుగా
రోజాను పలుమార్లు జగన్ మందలించినప్పటికీ ఈసారి మాత్రం కాస్త కటువుగానే చెప్పారని తెలుస్తోంది. తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని కూడా చెప్పారనే ప్రచారం సాగుతోంది. మీడియాలో హైలెట్ అవడానికే రోజా అలా చేస్తున్నారని సొంత పార్టీ నేతలు కూడా చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది.
గతంలో ప్రశాంత్ కిషోర్..
రోజా తీరుపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైసిపి అధినేత జగన్కు వ్యతిరేక రిపోర్ట్ ఇచ్చినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రోజా తీరుతో పార్టీకి నష్టమని, ఆమెను సరి చేయాలని అధినేతకు ప్రశాంత్ కిషోర్ సూచించారని తెలుస్తోంది.
జగన్కే నష్టమని..
రోజా తీరుతో జగన్కు, వైసిపికి నష్టమని ప్రశాంత్ కిషోర్ చెప్పారని ప్రచారం సాగింది. అధికార పార్టీని పని తీరుతో, వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టాలి తప్ప మాటలతో ఇష్టం వచ్చినట్లు ఎదురు దాడి చేయడం వల్ల కాదని, రోజాను అదుపు చేయాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీకి మరింత నష్టం జరగకముందే రోజాకు సూచనలు చేయాలని జగన్కు ప్రశాంత్ కిషోర్ సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి జగన్ హెచ్చరించారని తెలుస్తోంది.