వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు ఫిబ్రవరి 12కు: మాజీ మంత్రులు గైర్హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. జగన్ ఆస్తుల కేసులో శుక్రవారం ఉదయం వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి, బిసిసఐ శ్రీనివాసన్ తదితరులు న్యాయస్థానానికి హాజరయ్యారు. అనంతరం కోర్టు కేసును వాయిదా వేసింది.

శాసన సభ ఉన్నందున...

తమకు శాసన సభ ఉన్నందున తాము న్యాయస్థానానికి హాజరు కాలేకపోతున్నామని మంత్రి గీతా రెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణలు కోర్టుకు తెలిపారు.

కాగా, గత ఏడాది డిసెంబర్ 3న జగన్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మంత్రి గీతా రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డిలు కూడా హాజరయ్యారు. జగన్ ఆస్తుల కేసులో పది ఛార్జీషీట్ల పైన సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోంది.

డిసెంబర్ 3న జగన్ కోర్టుకు హాజరైనప్పుడు తెలంగాణ సెగ తగిలింది. దీంతో అప్పుడు ఉద్రిక్తతల మధ్య జగన్ కోర్టుకు వచ్చి, వెళ్లిపోయారు. జగన్‌ను కోర్టులోకి వెళ్తుండగా తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. విచారణ వాయిదా పడిన అనంతరం జగన్ బయటకు వెళ్తుండగా మరోసారి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy appeared before CBI special Court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X