వైసిపిలోకి టిడిపి నేత: కడప పర్యటనను వాయదా వేసుకున్న జగన్
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు.
కడప: మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు.
వైయస్ జగన్ ఈ నెల 14వ తేదీన కడపలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సన్నద్ధమయ్యారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నందున అధినేత పర్యటన వాయిదా పడింది.
చదవండి: అఖిలప్రియ పావులు: అందుకే బాబుకు శిల్పా షాక్, జగన్ లెక్క ఇదీ
ఎమ్మెల్యే అంజాద్ బాషా ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం జగన్ కడప నగరంలోని ఓ ప్రయివేటు వైద్యశాల ప్రారంభోత్సవానికి హాజరుకావడంతో పాటు ఆ రోజు సాయంత్రం ఎమ్మెల్యే అంజాద్ బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సి ఉందన్నారు.
14వ తేదీ జరగాల్సిన జగన్ పర్యటన ఈ నెల 15కు వాయిదా పడింది. నగరంలోని అమీన్ ఫంక్షన్ ప్యాలెస్లో 15వ తేదీ సాయంత్రం జరిగే ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు. శిల్పా మోహన్ రెడ్డి చేరిక కారణంగా వాయిదా పడింది.